ఢిల్లీకి తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలు

Update: 2019-02-05 03:53 GMT

రెండు తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ కీలకనేతలు కొందరు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశం జరగనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వేళ పార్టీనుంచి వలసలు ఉండకూడదని రాహుల్ వారికి సూచించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నాయకత్వాన్ని మారుస్తారని ప్రచారం జరుగుతోంది. 

Similar News