మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హాకీ ఆటగాళ్ల దుర్మరణం
♦ హోసంగాబాద్లోని రాసాల్పూర్ దగ్గర అదుపుతప్పిన కారు ♦ నలుగురు జాతీయస్థాయి హాకీ ఆటగాళ్ల దుర్మరణం ♦ ముగ్గురు ఆటగాళ్లకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం హోసంగాబాద్లోని రాసాల్పూర్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు జాతీయస్థాయి హాకీ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆటగాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధ్యాన్చంద్ ట్రోఫీలో భాగంగా హాకీ ఆటగాళ్లు కారులో ఇటార్సి నుంచి హోసంగాబాద్కు వెళుతున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది.