వాజ్‌పేయి, మోడీ కేబినెట్స్‌‌లో సుష్మా కీ రోల్‌

Update: 2019-08-07 03:34 GMT

వాజ్‌పేయి, మోడీ ప్రభుత్వాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన సుష్మాస్వరాజ్‌. ఒకసారి సమాచార ప్రసారాలశాఖ మంత్రిగా, మరోసారి విదేశాంగమంత్రిగా పనిచేశారు. ఐఅండ్‌పీఆర్‌లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సుష్మా.... విదేశాంగశాఖ మంత్రిగానూ అత్యంత కీ రోల్‌ పోషించారు. వాజ్‌పేయి, మోడీ కేబినెట్స్‌‌లో కీ రోల్‌ పోషించిన సుష్మాస్వరాజ్‌... అత్యంత కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా మోడీ మొదటి గవర్నమెంట్‌లో విదేశాంగ మంత్రిగా ప్రముఖ పాత్ర పోషించారు. 2014 నుంచి 2019వరకు భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా.. ఆ పదవికే వన్నెతెచ్చారు. విదేశాంగ మంత్రిగా అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటారు. ఐక్యరాజ్యసమితిలాంటి ఫ్లాట్‌ఫామ్స్‌‌పై తన వాడివేడి ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. అగ్రరాజ్యాలతోపాటు పలు కీలక దేశాలతో ద్వైపాక్షిక, స్నేహ సంబంధాలు మెరుగుదలకు విశేష కృషిచేశారు.

Tags:    

Similar News