ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ప్రారంభం అయ్యాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, తొలుత అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఎర్రకోట వద్దకు రాగా.. ఆయనకు త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికారు.

Update: 2019-08-15 02:12 GMT

73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ప్రారంభం అయ్యాయి. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, తొలుత అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఎర్రకోట వద్దకు రాగా.. ఆయనకు త్రివిధ దళాధిపతులు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికారు. ఎర్రకోటపై మువ్వెన్నల జెండా ఎగరవేశారు ప్రధాని నరేంద్రమోదీ. వరుసగా ఆరోసారి జెండా ఎగురవేశారు మోదీ. ఈ వేడుకలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్‌, స్వాంతత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News