జమ్మూకాశ్మీర్ పూంఛ్ సెక్టార్లో మరోసారి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. షాపూర్, షాజియాన్ ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భారత జవాన్లు.. పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టాయి. సుమారు గంట పాటు జరిగిన ఈ కాల్పుల ఘటనతో.. స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళలనకు గురయ్యారు.