నీతి ఆయోగ్ సీఈవోగా ఉన్న అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు కేంద్రం పొడిగించింది. అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని 2019 జూన్ 30 నుంచి 2021 జూన్ 30 వరకూ పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు పెర్సనల్ మినిస్ట్రీ బుధవారంనాడు ఒక ఉత్తర్వులో పేర్కొంది.