బ్రేకింగ్‌: సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్.. ఈ రాష్ట్రాలకే..

Update: 2019-03-10 05:53 GMT

కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం జరిగే ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈసారి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేరోజు జరగనున్నాయి. మొత్తం 8 నుంచి 10 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Similar News