jobs: DRDO ఎంటీఎస్ దరఖాస్తుల ప్రారంభం
నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో నిరుద్యోగ యువతకు డీఆర్డీఓ ఒక శుభవార్తను తెలియజేసింది.
నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో నిరుద్యోగ యువతకు డీఆర్డీఓ ఒక శుభవార్తను తెలియజేసింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనేజేషన్(డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (సెప్టం) వివిధ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబరు 23న ప్రారంభమై 2020 జనవరి 23న ముగియనున్నాయి. అర్హుతు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్డీఓ వెల్లడి ప్రకటన జారీ చేసింది.
పోస్టుల వివరాలు..
♦ మల్టీ టాస్కింగ్ స్టాఫ్
♦ మొత్తం ఖాళీల సంఖ్య : 1817
పోస్టుల కేటాయింపు
♦ జనరల్-849, ఈడబ్ల్యూఎస్-188, ఎస్టీ-11, ఓబీసీ-503, ఎస్సీ-163
వయోపరిమితి
♦ 23.01.2020 నాటికి 18 - 25 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్హత
♦ పదోతరగతి లేదా ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం
♦ ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100
♦ మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు.
♦ ఎంపిక విధానం: రెండు దశలరాతపరీక్షల ద్వారా.
♦ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ : 23.12.2019 ప్రారంభం
♦ ఆన్లైన్ దరఖాస్తుకు : 23.01.2020 చివరితేది