క్యూనెట్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాక్..
క్యూనెట్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. Q నెట్ సంస్థలో అన్ని అక్రమాలే అని రిజిస్టర్ ఆఫ్ కంపనీస్ ప్రకటించింది.
క్యూనెట్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. క్యూనెట్ సంస్థలో అన్ని అక్రమాలే అని రిజిస్టర్ ఆఫ్ కంపనీస్ ప్రకటించింది. ఇందులో ఎవరు పెట్టుబడులు పెట్టవదని కేంద్ర తెలిపింది. క్యూనెట్ సంస్థ వేల కోట్ల రూపాయలు ముంచేసిందని తేల్చారు. ఈ స్కామ్పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 70 మందిని క్యూ నెట్ స్కామ్లో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇప్పటి వరకు 30 కేసులు నమోదు చేశారు. క్యూ నెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో దేశ వ్యాప్తంగా 20 లక్షల మంది నుంచి పెట్టుబడులు ఆకర్షించింది. 20 వేల కోట్ల వరకు యాజమాన్యం మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.