కేరళలో రెండో కరోనా వైరస్ కేసు నమోదు
కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఈ వైరస్ దేశాలు, రాష్ట్రాలను దాటేస్తోంది.
కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఈ వైరస్ దేశాలు, రాష్ట్రాలను దాటేస్తోంది.!. చెన్నై ఎయిర్పోర్టులో కరోనా వైరస్ కలకలం రేపింది.! వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ అనే వ్యక్తి మలేషియా నుంచి చెన్నై వచ్చాడు.
రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా.. మరో వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నారు. కాగా ఈ రెండు కేసులకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కరోనా వైరస్ కారణంగా చైనాలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. కరోనా వైరస్తో శనివారం ఒక్కరోజే 45 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 304కి చేరింది. వ్యాధి తీవ్ర ఎక్కువగా ఉన్న.. హుబే ప్రావిన్స్లో శనివారం ఒక్కరోజే కొత్తగా 2వేల కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.