ఢిల్లీ ఘర్షణపై క్రేజీవాల్ ఆందోళన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టిన వేళ ఒక్కసారిగా చెలరేగిన హింస కాండపై సీఎం అరవింద్ క్రేజీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టిన వేళ ఒక్కసారిగా చెలరేగిన హింస కాండపై సీఎం అరవింద్ క్రేజీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనల్లో అనేక మంది పోలీసులు, పౌరులు గాయపడ్డారన్నారు. ఇది దురదృష్టకరమన్నారు.
ప్రశాంత వాతావరణం కోసం అందరూ కలిసి పని చేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. సంయమనంతో ఉండాలని సూచించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని, వారి సమస్యపై చర్చించేందుకు సిద్ధమని కేజ్రీవాల్ ప్రకటించారు.