ముంబై వర్షాలతో ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా పోయింది. వారితో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా జత చేరారు. ఆమె ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాలీవుడ్ నటి సోనం కపూర్ ముంబై వర్షాల నేపథ్యంలో 'ముంబయి ఎయిర్పోర్ట్ తెరిచి ఉందో లేదో ఎవరైనా సమాచారం అందిస్తారా?' అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబయి పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
దానికి రకుల్ 'సోమవారం రాత్రి నుంచి ఒక్క విమానం కూడా ఎయిర్పోర్ట్ నుంచి కదల్లేదు. నేను ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయాను' అని జవాబిచ్చారు.
ఇదిలా ఉంటే సోనం ట్వీట్ కు ముంబై పోలీసులు కూడా స్పందించారు. 'విమానాశ్రయం మేనేజర్ అందించిన సమాచారం ప్రకారం వాతావరణ పరిస్థితులు అనుకూలించినంతలో విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. కాకపోతే ఆలస్యం అవుతోంది అని చెప్పారు. ఒక్కసారి చెక్ చేసుకుని మీరు ప్రయాణానికి సిద్ధం కావడం మంచిది.' అని జవాబిచ్చారు.
Can anyone tell me if the airport is open? @mybmc @MumbaiPolice @BOMairport
— Sonam K Ahuja (@sonamakapoor) July 2, 2019