నక్సల్స్, ఎస్టీఎఫ్ దళాల మధ్య హోరాహోరీ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. ఈ ఘటన ఛతీస్గఢ్లోని దాంతారి అటవీప్రాంతంలో జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది నక్సల్స్ జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నక్సల్స్కు పోలీస్ సిబ్బందికి మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మృతదేహాలు, వారి వద్దనున్న ఏడు తుపాకులను జప్తు చేసుకున్నారు. కాగా ఎస్టీఎఫ్ దళాలు ఇప్పటికీ గాలింపు కొనసాగిస్తున్నట్టు డీఐజీ సుందర రాజ్ తెలిపారు.