మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమా పై మనస్సు పారేసుకున్న మెగస్టార్ చిరంజీవి. మోహన్లాల్ నటించిన చిత్రం `లూసీఫర్`. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో తీసిన సినిమాల్లో ఇదొకటి. తెలుగులో డబ్ అయినా సరిగా ఆడలేదు. ఈ సినిమాని చిరంజీవి, చరణ్ లు కలిసి రీమేక్ చేస్తారని వార్తలొచ్చాయి. సైరా ప్రమోషన్లలో భాగంగా ఫృథ్వీరాజ్ సమక్షంలోనే చిరంజీవి `లూసీఫర్` రీమేక్ విషయాన్ని ప్రస్తావించాడు కూడా. అయితే లూసీఫర్ రీమేక్ విషయంలో చిరంజీవి పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా మలయాళ వెర్షన్ చిరంజీవికి బాగా నచ్చింది. ఈ విషయాన్ని ఎన్వీ ప్రసాద్లో చర్చిస్తుంటే ఆయన ఆఘమేఘాల మీద `లూసీఫర్` రీమేక్ రైట్స్ కొనుక్కొచ్చేశార్ట.
దీనికి సుకుమార్ డైరెక్షన్ చేస్తాడని బాగా ప్రచారం అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రీమేక్ చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను చర్చించుకుంటే మాత్రం మన తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం ఇలాంటి సినిమాలు నప్పవన్న విషయం క్లియర్ కట్గా అర్థమైందట. అంతే కాదు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా విడుదలైందని, అది రెండు రోజులకు మించి ఆడలేదన్న విషయం చిరు గుర్తించి లూసీఫర్ ని రీమేక్ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రిమేక్ రైట్స్ కొన్న ఎన్వీ ప్రసాద్ కూ మాత్రం బాగానే నష్టపోయాడు.