ఉపాసనకి అవార్డు..

Update: 2019-10-05 10:55 GMT

కొణిదెల వారి కోడులు అయిన ఉపాసన సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు తన వృత్తి పరంగా, అటు ఫ్యామిలీ పరంగా ఎప్పటికప్పుడు విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇక ఇవే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఉంటుంది. వీటితో పాటు అపోలోకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది. అయితే తాజాగా ఉపాసనకి కార్పోరేట్ రంగంలో అవార్డు లభించింది. మహాత్ముడి 150 జయంతి సందర్భంగా ఈ అవార్డును ఉపాసన అందుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్  మీడియాలో పోస్ట్ చేసింది. గాంధీ జయంతి సందర్భంగా ఈ అవార్డు రావడంతో మహాత్మాగాంధీ చెప్పిన ఓ కొటేషన్ ని ఉపాసన పోస్ట్ చేసింది. "నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. వేరే వారి సేవలో నిన్ను నీవు అర్పించుకో" అంటూ, గాంధీజీ 150వ జయంతి మా కుటుంబానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చిందంటూ సైరా నరసింహా రెడ్డిని ట్యాగ్ ఆడ్ చేసింది ఉపాసన...



Tags:    

Similar News