ప్రభాస్ టైటిల్ ని మార్చాల్సిందేనా?
గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన
గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ కలెక్షన్లలను మాత్రం బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ప్రచారం సాగుతుంది. కానీ దీనిపైన చిత్రబృందం స్పదించలేదు. అభిమానులు మాత్రం అదే టైటిల్ అని ఫిక్స్ అయిపోయారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కి కొత్త చిక్కు వచ్చి పడింది. తాజాగా శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలలో రూపొందుతున్న 96 రీమేక్ చిత్రానికి జాను అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్తో పాటు టైటిల్. టీజర్ లను రిలీజ్ చేశారు. దీనితో ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ని చేంజ్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టుగా తెలుస్తోంది. జాన్ అనే పేరు ఉంచితే ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.
కే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా తర్వాత ప్రభాస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే వీరిమధ్య కథ చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో చిత్రం విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది. ఇందులో అల్లు అర్జున్ , పూజా హేగ్దే హీరో హీరోయిన్లుగా నటించారు.