సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురి చేశారంటూ జబర్దస్త్ యాంకర్ అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర వ్యాఖ్యలపై ఆమె ట్విట్టర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
తనను వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అనసూయ ట్వీట్పై సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ట్విట్టర్లో పోలీసులకు అనసూయ ధన్యవాదాలు తెలిపారు.
Thank you for the response Sir.. #hopeRestored https://t.co/5aLpod4GDL
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 9, 2020