నా భార్యకు కరోనా లేదు.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో
సెలబ్రిటీలకి సంబంధించిన ఏ వార్త అయిన సరే క్షణాల్లో వైరల్ అవుతుంది.
సెలబ్రిటీలకి సంబంధించిన ఏ వార్త అయిన సరే క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో నిజం ఎంతుందో ఏమో తెలియదు కానీ మళ్లీ దానిపై క్లారిటీ వచ్చేవరకు సోషల్ మీడియాలో ఆ వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక బాలీవుడ్ లో బెస్ట్ కపూల్ గా అజయ్ దేవగన్, కాజోల్ కి మంచి పేరు ఉంది. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. అజయ్ దేవగన్ భార్య కాజోల్ కి, వీరిద్దరి కూతురు నైసా కు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో దీనిపైన అజయ్ దేవగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు..
వారిద్దరి ఆరోగ్యం బాగుందని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఇదంతా అసత్యపు ప్రచారమని కొట్టిపరేశాడు.. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు వారిద్దరు క్షేమంగానే ఉన్నారంటూ పోస్టు పెట్టాడు. ఇక కాజోల్ 1990లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. షారుఖ్ ఖాన్, కాజోల్ ది బెస్ట్ జోడిగా బాలీవుడ్ లో ఓ ట్రెండ్ ని క్రియేట్ చేసింది. దిల్ వాలే దుల్హనియా లేజాయింగే' ' కుచ్ కుచ్ హోతా హై' వంటి సినిమాలు ఓ క్లాసిక్ గా నిలిచాయి.. ఇక ఆమె 1999లో కాజోల్ అజయ్ దేవగణ్ను పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు.
ఇక అజయ్ దేవగన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న అజయ్ దేవగన్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు జక్కన్న... ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
Thank you for asking. Kajol & Nysa are absolutely fine. The rumour around their health is unfounded, untrue & baseless🙏
— Ajay Devgn (@ajaydevgn) March 30, 2020