హాస్యనటుడు వేణుమాధవ్ మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలుపుతుంది. అయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపద్యంలో వేణుమాధవ్ ను ఉద్దేశించి నటుడు ఉత్తేజ్ తన ఫేస్ బుక్ లో భాగోద్వేగ లేఖను రాశారు.
"మిస్ యూ వేణు..!
చాలా మంచోడివి డార్లింగ్ నువ్వు..
ఎన్ని నవ్వుల్ని పంచావ్..
ఎన్ని అనుభూతుల్ని పంచుకున్నావ్ ..
ఒకటా..! రెండా..!!
నీతో గడిపిన ప్రతిక్షణం
గుర్తుండిపోయేలా చేయడం నీకే సాధ్యం..
కలిసి అమలాపురం వెళ్ళినా...
కలిసి అమెరికాకి వెళ్ళినా ...
నువ్వు మారావ్.. నీతో స్నేహం మారదు.. నీ తీరు మారదు..
నీ వ్యక్తిత్వం మారదు...
నీతోపాటు పదిమంది బాగుండాలి..
షూటింగ్స్ లో బిజీగా ఉండాలి..
పదిమందితో కలిసి భోజనం చేయాలి...అందరు పచ్చగా ఉండాలి అని కోరుకునే స్నేహ పిచ్చోడివి..
అందరి గురించి ఆలోచిస్తూ ..
నీ గురించి ఆలోచించుకోకే ఇలా జరిగిందేమో..!
నా చివరంటూ గుర్తుంటావ్.. లవ్ యూ"
అంటూ ఉత్తేజ్ భాగోద్వేగ పోస్ట్ పెట్టారు ఉత్తేజ్ ...
Also read: డబ్బులు ఇస్తే తాగుతారని రేషన్ సరుకులు పంపించేవాడు : ఉత్తేజ్