డబ్బులు ఇస్తే తాగుతారని రేషన్ సరుకులు పంపించేవాడు : ఉత్తేజ్

డబ్బులు ఇస్తే తాగుతారని రేషన్ సరుకులు పంపించేవాడు : ఉత్తేజ్
x
Highlights

హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ప్రతిఒక్కరిని కలిచివేస్తుంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఈ రోజు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో...

హాస్యనటుడు వేణుమాధవ్ మరణం ప్రతిఒక్కరిని కలిచివేస్తుంది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఈ రోజు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన మరణం పట్ల తెలుగు సినీరాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయన మరణం చిత్రపరిశ్రమకి తీరని లోటని చెబుతున్నారు. వేణుమాధవ్ తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకొని విలపిస్తున్నారు. ఈ నేపధ్యంలో నటుడు ఉత్తేజ్ వేణుమాధవ్ తో ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. వేణుమాధవ్ తనకి మిమిక్రి ఆర్టిస్ట్ గా ఉన్నప్పటినుండి తెలుసునని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేని వారి లిస్టు రాయించి నిర్మాతలకు చెప్పి తన పక్కన వేషాలు ఇప్పించేవాడని అన్నారు. సినిమా అవకాశలు లేని వారికీ డబ్బులు ఇస్తే తాగుతారని రెండు నెలలకి సరిపోయే రేషన్ సరుకులను వారి ఇంటికి పంపించేవాడని ఉత్తేజ్ చెప్పుకొచ్చాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories