ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ కామర్స్, డిజిటల్ వాలెట్ సేవల కంపెనీలు ప్రేమికులను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్లను ప్రకటించాయి. స్మార్ట్ఫోన్లు నుంచి.. ఫ్యాషన్ ఉత్పత్తులు, నగలు, విమాన టిక్కెట్ల వరకు అన్నింటిపైనా రాయితీలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఆర్డర్ చేసేవారికి రివార్డ్ పాయింట్స్ అందించనున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు షావోమి, సామ్సంగ్ ఆసక్తికరమైన ఆఫర్లు ప్రకటించాయి.
ఇందులో భాగంగా ఎంఐ పోకో ఎఫ్1పై రూ.3,000 వరకు రాయితీ కల్పిస్తోంది. రెడ్మీ 6పై రూ.2 వేల వరకు, రెడ్మీ నోట్ 5 ప్రో మోడల్పై రూ.4,000 డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్ఫోన్లతోపాటు ఎంఐ స్మార్ట్టీవీలు, మొబైల్ హెడ్ఫోన్స్, స్పీకర్లు, పవర్ బ్యాంక్లు, స్మార్ట్ వాచ్లపైనా సంస్థ రాయితీలు ఆఫర్ చేస్తోంది. అలాగే సామ్సంగ్ 'బెస్ట్ డేస్' పేరుతో సేల్ను ప్రకటించింది. గెలాక్సీ ఎస్9ప్లస్, గెలాక్సీ నోట్9పై రూ.7 వేల వరకు రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లో హెచ్డీఎఫ్ సీ డెబిట్, క్రెడిట్ కార్డుదారులు అదనంగా రూ.6 వేల వరకు క్యాష్ పొందే వీలును కల్పించింది.