టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైనలైజ్ చేశారు. ప్రస్తుతమున్న టీటీడీ బోర్డు రద్దు తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. వైవీని ముందు రాజ్యసభకు పంపాలని జగన్ భావించినా వైవీ సుబ్బారెడ్డి విముఖత చూపడంతో టీటీడీ ఛైర్మన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు.