ఎన్నికల లెక్కల కౌంటింగ్ లో వైఎస్సార్ సీపీ మంచి దూకుడుని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం 149 సంఖ్యతో ముందంజలో ఉంది .. ఇక టిడిపి ఎక్కడ కూడా వైఎస్సార్ సీపీని అందుకోలేకపోతుంది .. ఇటు అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాకుండా అటు లోక్సభ స్థానాల్లో కూడా సత్తా చాటుతుంది .. మొత్తం 25 లోక్సభ స్థానాలకుగానూ వైఎస్సార్ సీపీకి 24 ఎంపీ సీట్లలో ఆధిక్యంలో ఉండగా, టీడీపీకి కేవలం ఒక్క సీటులో ముందంజలో ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసినా ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడం గమనార్హం. బీజేపీకి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది.