మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సొంత నియోజకవర్గం మైలవరంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేతలపై తప్సుడు కేసులు పెట్టారంటూ ఆ పార్టీ శ్రేణులు మైలవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళనకు దిగాయి. మైలవరం పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వసంత కృష్ణ ప్రసాద్తో పాటు ఆయన అనుచరుడు వెంకట రామారావుపై పోలీసులు బనాయించిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్ నేతృత్వంలో ఈ ధర్నా , రాస్తారోకో జరుగుతోంది.