రాష్ట్రంలో అధికార టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్ష వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ తర్వాత రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు సృష్టిస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ అదే విషయంపై సీఈసీకి ఫిర్యాదు చేసింది. అలాగే చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తుందని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని కంప్లైంట్లో పేర్కొంది. అలాగే రాష్ట్రంలో ఈవీఎంలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరింది.