ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణామూర్తి బీ ఫారం అందుకున్నారు. గురువారం సాయంత్రం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి జంగాకు బీఫాం అందజేశారు. ఈ నెల 25న ఏపీ అసెంబ్లీలో జంగా నామినేషన్ వేయనున్నారు. వైసీపీలో కీలకంగా ఉన్న బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన 'బీసీ గర్జన' సభా వేదికగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.