సీఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు

Update: 2019-05-18 08:28 GMT

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలిశారు. కౌంటింగ్‌ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోకవర్గంలో రీ పోలింగ్‌ కట్టుదిట్టంగా, పారదర్శకంగా జరిపించాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ప్రద్యుమ్న సహాయంతో టీడీపీ నేతలు అనేక తప్పులకు పాల్పడ్డారని వైసీపీ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.  

Similar News