వైఎస్ వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని, కావాలనే లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారని చినరాజప్ప విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడైనా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుందని, అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారా అని ప్రశ్నించారు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఫెయిల్ అయ్యింది వాళ్ల బాబాయిని కుటుంబ సభ్యులే హత్య చేసి ఎన్నికల సమయంలో మెప్పుకోసం ప్రయత్నించారని విమర్శించారు. స్పీకర్ కోడెల ప్రశాంతంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తుంటే దాడి చేశారని ఆరోపించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం కావడం ఖాయమని చెప్పారు.ఈవీఎంలలో సమస్యలు తలెత్తినా టీడీపీ కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారని చెప్పుకొచ్చారు.పోలింగ్ రోజు ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.