మా అన్న జగన్ పై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు: సునీతా రెడ్డి

Update: 2019-03-22 10:06 GMT

తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సిట్‌ విచారణను తప్పుదోవ పట్టించేలా నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నరని వైయస్ సునీత మండిపడ్డారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆయన కూతురు వైఎస్ సునీత ఆరోపించారు. కేసుతో సంబంధంలేని జగన్ పై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయంపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ సునీత ఫిర్యాదు చేశారు. సిట్ విచారణపై నమ్మకం లేదని, పారదర్శక విచారణ కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరనున్నట్లు వైఎస్ సునీత వెల్లడించారు. మా అన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైయస్ సునీత అన్నారు. అలాగే ఈ అంశంపై మా అమ్మ విజయవాడ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తారు' అని తెలిపారు.

Similar News