ప్రభాస్‌కీ, నాకూ ఎటువంటి సంబంధం లేదు: షర్మిల

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ దంపతులు ఫిర్యాదు చేశారు.

Update: 2019-01-14 08:05 GMT
ys sharmila

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ దంపతులు ఫిర్యాదు చేశారు. తమపైనా, తమ కుటుంబసభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.'నాకూ, ప్రభాస్‌కు సంబంధం ఉందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నా జీవితంలో ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు. 2014 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారాలే చేశారు. అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడంతో కొంతకాలం ఆగింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీని వెనుక టీడీపీ హస్తం ఉంది' అని షర్మిల ఆరోపించారు.

Full View

Similar News