నేడు తిరుమలకు జగన్‌

Update: 2019-05-28 01:38 GMT

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ నేడు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం తిరుమలకు చేరుకొని రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే ఇడుపులపాయతో పాటు కడప పెద్ద దర్గాను కూడా దర్శించుకుంటారు. 30 న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న జగన్‌ నేడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు అమరావతిలోని తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకుంటారు. ఈ రాత్రికి తిరుమలలోనే బస చేయనున్న జగన్‌ రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్‌ తిరుమల పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత జగన్‌ కడప జిల్లా పర్యటనకు వెళ్తారు. ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి వైఎస్‌ సమాధికి నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో జగన్‌తో సహా కుటుంబ సభ్యులు హాజరవుతారు. ఆ తర్వాత జగన్‌ కడప పెద్ద దర్గాను కూడా దర్శించుకుని ఆశీస్సులు పొందుతారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. 30 వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు

Similar News