నేడు భీమవరంలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Update: 2019-04-01 00:24 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (సోమవారం) విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. నేటి ఉదయం 9.30 గంటలకు విజయనగరం జిల్లా ఎస్‌.కోట, 11.30 గంటలకు విశాఖపట్నం జిల్లా పెందుర్తి, పగలు 1.30 గంటలకు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, సాయంత్రం 3.30 గంటలకు ప.గో జిల్లాలోని భీమవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా వైసీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేడు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, రాజాం, పాతపట్నం అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇక వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్ షర్మిల నేడు గుంటూరు జిల్లాలోని పొన్నూరు, తెనాలి, కృష్ణా జిల్లాలోని పెనమలూరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించి వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. అక్కడక్కడ రోడ్‌షో, బహిరంగ సభల్లో వైఎస్ షర్మిల పాల్గొంటారు. 

Similar News