పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు...

Update: 2019-03-19 13:18 GMT

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. మాటల తూటలతో ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ సందర్బంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉంటా అందరి కష్టాలూ తీరుస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తోన్న కామెంట్స్‌పై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సెటైర్లు వేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఎవరైనా దత్తత తీసుకుంటారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్రజలను అన్నిరకాలుగా వెన్నుపోట్లు పొడిచారని వైఎస్ జగన్ ఆరోపించారు. సహాయం కోసం వచ్చే పేదలతో చంద్రబాబు రాజకీయం చేశారని, కానీ వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఒక్కసారి వైసీపీకి అవకాశమివ్వండి సుపరిపాలన ఎలాగుంటుందో చూపిస్తానన్నారు జగన్‌.

Similar News