వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం: జగన్‌

Update: 2019-04-04 12:20 GMT

మోసపూరిత హామీలు ఇవ్వడం ప్రజలకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌. 2014 ఎన్నికల సమయంలో 650 హామీలు ఇచ్చిన చంద్రబాబు 5 శాతం కూడా నెరవేర్చలేక పోయారంటూ విమర్శించారు. రైతులు, డ్వాక్రా, చేనేతలకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేకపోయారంటూ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే బాదుడు తప్ప సంక్షేమం ఉండదన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ‍యన తమ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేసి రాష్ట్ర ప్రజల తలరాత మారుస్తామన్నారు. పేదవారి నెత్తిన అప్పులు మోపి బాబు స్కామ్‌లు చేస్తున్నారు. మూడు లక్షల రూపాయలు కూడా విలువ చేయని ఫ్లాట్‌లను 6 లక్షల రూపాయలకు పేదవారికి అమ్ముతున్నారు. అందులో లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం, లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 3లక్షల రూపాయలను అప్పుగా రాసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని పేదవారు 20 ఏళ్ల పాటు నెలకు మూడు వేల రూపాయల చొప్పున కట్టాలని అంటున్నారు. లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే ఆ మొత్తాన్ని పేదవారు చెల్లించాలా? అని జగన్ అన్నారు. 

Similar News