కాసేపట్లో విజయవాడకు జగన్...ప్రత్యేక హెలికాఫ్టర్‌లో...

Update: 2019-05-22 10:49 GMT

వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్‌ నుంచి మరికాసేపట్లో విజయవాడ బయలుదేరనున్నారు. లోటస్‌పాండ్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో విజయవాడకు పయనమవుతారు. జగన్‌ వెంట కొంత మంది సీనియర్ నేతలు కూడా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరనున్నారు. జగన్‌ విజయవాడ వస్తున్నారన్న సమాచారంతో పార్టీ నేతలంతా తాడేపల్లి పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారన్నారు. ఈ సాయంత్రం 6గంటలకు పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి కౌంటింగ్, ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో జగన్‌ చర్చించనున్నారు.

Similar News