హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. సీఎం జగన్తోపాటు పలువురు న్యాయనిపుణులు సీజే నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటుకు న్యాయమూర్తిని కేటాయించాలని, గత ఐదేళ్లలో కేటాయించిన కాంట్రాక్టులు, భూ కేటాయింపులపై న్యాయవిచారణ జరపాలని జగన్ కోరినట్లు తెలియవచ్చింది. నిధులు దుర్వినియోగం అయిన చోట రివర్స్ టెండరింగ్లో కాంట్రాక్టులు రద్దు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాలకు తావివ్వకుండా సిట్టింగ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ను జగన్ కోరినట్లు తెలియవచ్చింది.హైకోర్టు సీజేతో జగన్ భేటీ