ఏపీ కేబినేట్ కూర్పు దాదాపుగా సిద్ధమైంది. మంత్రివర్గంలో బెర్తులకు సంబంధించిన జాబితా కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీ వాణి, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్లకు కేబినెట్లో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి నుంచి పి.సుభాష్ చంద్ర బోస్, దాడిశెట్టి రాజాలకు అవకాశం దక్కనుండగా.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముడునూరి ప్రసాద రాజుకు క్యాబినెట్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. కృష్టా జిల్లా నుంచి కొడాలి నానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి, సుచరితలకు మంత్రి పదవులు ఖాయంగా వస్తాయని ప్రచారం జరుగుతోంది. నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డికి జగన్ డ్రీమ్ టీమ్లో స్థానం దక్కినట్లు తెలుస్తోంది. చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డిలకు క్యాబినెట్లో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కడప నుంచి అంజాద్ పాషా అనంతపురం నుంచి అనంత వెంకట రామిరెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.