లోకేష్‌కి ఆ నియోజకవర్గంలో మండలాలెన్నో తెలియదు..: విజయసాయిరెడ్డి

Update: 2019-03-21 11:15 GMT

వైయస్ వివేకానంద హత్యతో ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతునే ఉన్నాయి. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మరోవైపు ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఇరు పార్టీల నేతల మాటల తూటాలు, పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోలీసుల్నీ తప్పుదోవ పట్టిస్తున్నరని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బాబు డైరెక్షన్‌ మేరకే సిట్‌ బృందం దర్యాప్తు చేస్తుందని మండిపడ్డారు. ఏం మాట్లాడుతున్నారో చంద్రబాబుకే అర్థం కావట్లేదని అన్నారు. నాలుకేమో మందం, మెదడేమో మోకాళ్లలో ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. లోకేష్‌కి మంగళగిరి నియోజకవర్గంలో మండలాలెన్నో తెలియదని ఎద్దేవాచేశారు.

Similar News