పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ను కలిసేందుకు వచ్చిన ఆయన్ను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆరు బయటే రెండు గంటల పాటు పడిగాపులు కాశారు. ఇదే సమయంలో అటు వైపు వచ్చిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టించుకోకుండా వెళ్లడంతో సునీల్ తీవ్ర మనస్ధాపం చెందారు.