వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఉగాది రోజు అంటే ఎల్లుండి వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆ పార్టీ అధినేత నిర్ణయించారు. అమరావతి వేదికగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయనున్నారు జగన్. గతంలో జగన్ ప్రకటించిన నవరత్నాలు అజెండాగా వైసీపీ మేనిఫెస్టో రూపొందింది. అలాగే సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలకు మేనిఫెస్టోలో ప్రముఖంగా చోటు కల్పించినట్లు సమాచారం.