తన భార్య ఎవరితోనే సెల్ ఫోన్లో మాట్లాడుతుందని మాట్లాడద్దని తన భర్త కొద్దిగా గట్టిగ మందలించడంతో భార్య ఏకంగా ఇల్లు విడిచి పోయింది. ఈ సంఘటన కర్ణాటక బాగలూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. ఇక వివరాల చూస్తే బెంగళూరు హొసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్రాజ్ భార్య శిల్ప (23). వీరు హొసూరు సమీపంలోని బాగలూరులో జీవనం సాగిస్తున్నారు. అయితే శిల్ప సెల్ ఫోన్లో ఇంకేవరితోనే తరచూ ఫోన్ మాట్లాడుతుందని భర్త ప్రేమ్రాజ్ శిల్పతో గొడవపడేవాడు. అయితే ఇదే విషయమై ప్రేమ్రాజ్ ఇటీవల నిలదీశాడు. ఇక దీంతో ఇద్దరి మధ్య గోడవ చిరిగి చిరిగి గాలి వానలా మారి స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో శిల్ప ఏప్రిల్ 26వ తేదీ బంధువుల ఇంటికెళ్లి వస్తానని వెళ్లింది మళ్లీ ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. అయితే తన భర్త చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడా పత్తలేదు. ఇక ఏంచేయాలో తెలియక ప్రేమ్రాజ్ బాగలూరు పోలీసు ఠాణాకి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ప్రేమ్ రాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.