కూటమిలో ప్రతి ఒక్కరూ కింగ్లే: మమతా
టీఎంసీ సారథ్యంలో కోల్కతాలోని బ్రినేడ్ మైదానంలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ చారిత్రక అనివార్యత దృష్ట్యా కోల్కతాలో తామంతా సమావేశమయ్యాయమని అన్నారు.
టీఎంసీ సారథ్యంలో కోల్కతాలోని బ్రినేడ్ మైదానంలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విపక్షాల ఐక్య ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ చారిత్రక అనివార్యత దృష్ట్యా కోల్కతాలో తామంతా సమావేశమయ్యాయమని అన్నారు. కూటమిలో ప్రతి ఒక్కరూ కింగ్లేనని అన్నారు. మోదీ ప్రభుత్వంలో 'అచ్చే దిన్' ఎండమావే అయిందన్నారు. మంచిరోజులు ఎక్కడొచ్చాయని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆటలు సాగనీయమని స్పష్టం చేశారు. బీజేపీకి విపక్ష నేతలంటే గౌరవం లేదని, బీజేపీ విభజన రాజకీయాలను దేశ ప్రజలకు ఏమాత్రం నమ్మరని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న మతత్వ విధానాలతోనే ఆ పార్టీ ఓటమి చవిచూడక తప్పదని జోస్యం చెప్పారు.