ప్రణయ్ పుట్టిన రోజు నాడే అమృత మగబిడ్డకు జన్మనిచ్చిందని ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి, హేమలత తెలిపారు. మిర్యాలగూడలో ప్రాణహాని ఉండటంతోనే అమృత డెలివరీ కోసం హైదరాబాద్ రావాల్సి వచ్చిందన్నారు. పోలీసులు, మీడియా రక్షణతోనే తమ కుటుంబం బతుకుతోదన్న బాలస్వామి నిందితులకు శిక్ష పడేవరకు పోరాటం చేస్తానన్నారు. కుల వ్యవస్థ పోవాలి సాంఘిక సమానత్వం రావాలన్న బాలస్వామి ప్రణయ్ హంతకులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆ భయం వల్లే అమృత డెలివరీ విషయాన్ని మీడియాకు చెప్పలేకపోయామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో మిర్యాలగూడకు వెళ్తున్నామని, తమకు పోలీసులే రక్షణ కల్పించాలని బాలస్వామి విజ్ఞప్తి చేశారు. మారుతీరావు లాంటి వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నారని ప్రణయ్ తల్లి ప్రేమలత అన్నారు. హైదరాబాద్లో అద్దెకు ఇల్లు కావాలంటే ఏ కులమని అడిగారని వాపోయారు. మారుతీరావు భార్య తమ ఇంటికి మీడియేటర్స్ని పంపి బెదిరిస్తోందని, తమకు రక్షణ కావాలని ప్రేమలత కోరారు.