వన్డే వరల్డ్కప్లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు సన్నద్ధమవుతున్న తరుణంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత సారథి విరాట్ కోహ్లీకి గాయమైంది. దీంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో సాధన చేస్తుండగా విరాట్ బొటన వేలుకు గాయమైంది. గాయం ఎలా అయిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. శనివారం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయంతో కోహ్లి విలవిల్లాడగా, వెంటనే టీమిండియా ఫిజియో పాట్రిక్.. అతని బొటన వేలిపై స్ప్రే చేసి ప్రథమ చికిత్స చేశాడు. ప్రస్తుతం అతని గాయం తీవ్రతపై టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈనెల 5న సౌతాఫ్రికాతో పోరులో భారత ప్రపంచకప్ టోర్నీని ఆరంభించనుంది.