వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరారు. నిన్న అర్ధరాత్రి దాటాక ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. వంగవీటితో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. వంగవీటిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు లగడపాటి కీలకపాత్ర పోషించారు. రెండు రోజుల క్రితమే బెజవాడ టీడీపీ నేతలతో పాటు లగడపాటి రాజగోపాల్ వంగవీటి రాధతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి తన డిమాండ్లను తెలియజేశారు. ఆయా డిమాండ్లకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతరాత్రి వంగవీటి సీఎంతో భేటీ అయ్యారు. ఒకటి రెండురోజుల్లో రాధా అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాధాకు మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.