అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ ని జనం విశ్వసించడంతోనే చారిత్రక తీర్పువచ్చిందన్నారు. 50శాతం ఓట్లు సాధించడం ఇదే తొలిసారి అన్నారు. జగన్ పాలనలో అందుకు తగ్గట్టుగా మార్పులు రావాలని ఆయన ఆకాక్షించారు. ఢిల్లీలో జగన్ కామెంట్స్ చూస్తే వైఎస్సార్ గుర్తుకొచ్చారన్నారు. అవినీతి రహిత పాలనతో జగన్ ముందుకు వెళ్తానని జగన్ ప్రకటించడం విప్లవాత్మక నిర్ణయమని తెలిపారు. అవినీతి రహిత పాలన కోసం ముందు ఎమ్మెల్యేలను, ప్రజలను జగన్ ఒప్పించాలని అన్నారు. కరప్షన్ ఫ్రీ పాలన అందించాలని, కేరళలలో అవినీతికి జరకుండా అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్ జగన్ ఇక్కడ కూడా అమలుచేస్తే మరో 30 ఏళ్లు సీఎంగా ఆయనే కొనసాగుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.