టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి.. ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

Update: 2019-04-28 10:26 GMT

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పరిషత్ టికెట్ల కోసం మహాయుద్ధమే జరుగుతోంది. అయితే ఇప్పటు తెలంగాణ అంతటా గూలాబీ హావా నడుస్తోందని పార్టీలో టిక్కెట్ దొరికితే సులువుగా గెలుస్తామన్న ఆశతో కొందరు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్లు లభించని వారు బెదిరింపులకు దిగుతున్నారు. తమకే తమకే జెడ్పీటీసీ టికెట్ కావాలని ఇవ్వకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ ఇద్దరు యువకులు హడావిడి సృష్టించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఇద్దరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. మఠంపల్లి జెడ్పీటీసీ టిక్కెట్‌ తమకే ఇవ్వాలని పార్టీ కార్యాలయం ముందు కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. 

Similar News