దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ఇరు రాష్ట్రాల సీఎంలు

కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకి దేశ ప్రజలు దీపాలు వెలిగిస్తూ సంఘీభావం తెలిపారు.

Update: 2020-04-05 16:41 GMT
two telugu state cm's light up a candle following the call of pm modi

కరోనాపై పోరుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకి దేశ ప్రజలు దీపాలు వెలిగిస్తూ సంఘీభావం తెలిపారు. ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు... అంతేకాకుండా మరోవైపు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కుటుంబసభ్యులతో కలిసి కొవ్వొత్తి వెలిగించారు. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభుషణ్ హరిచందన్ కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు... ఇక సినీనటులతో పాటు, రాజకీయ నాయకులూ సామాన్య ప్రజలు దీపాలు వెలిగించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.  

Tags:    

Similar News