అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసరంగా భేటీ అయ్యారు. సీఎల్పీ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి 15మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాగా, ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సుధీర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, సురేందర్, జగ్గారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, హర్షవర్థన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి హాజరయ్యారు.