వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దారుర్ మండలం రాజాపూర్ గ్రామంలోని పొలాల్లో పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం జరగడంతో తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే దర్మరణం చెందారు. తండ్రి ఫకృద్ధీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.